Johny Takkedasila
' కవిత్వాన్ని రెండు రకాలుగా విభజించుకుంటే, మొదటిరకం కవిత్వం పాఠకులను తికమక పెట్టడం, అర్థం కాకుండా ఇబ్బందిపెట్టడం, ఎంచుకున్న వస్తువు నుండి తప్పిపోయి సంచరించడం, కవితా శిల్పం చెదిరిపోవడం లాంటి అనేక సమస్యలు ఉంటాయి. రెండోరకం కవిత్వంలో పాఠకుడు కవిత్వం చదివిన తర్వాత తన్మయత్వం చెందుతాడు, చైతన్యవంతుడు అవుతాడు, ఆధునికంగా ఆలోచించడం మొదలుపెడతాడు, పురోగమనం వైపు నడవగలుగుతాడు, ఒక కొత్త చూపు, మార్గం వైపు సాగుతాడు. గోపి గారి కవిత్వం రెండోరకం. రంగురంగుల పూలవనం లాంటి కవితా వస్తువులు, పచ్చని అడవి లాంటి కవిత్వశిల్పం, వేసవిలో మట్టికుండలో దాహం తీర్చే మంచి నీళ్ల లాంటి కవిత్వం వారి సొంతం. జాని తక్కెడశిల కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత '